IND Vs NZ : రెండో టెస్ట్ లో కూడా భారత్ ఘోర పరాజయం..!

-

న్యూజిలాండ్ తో మూడు టెస్ట్ సిరీస్ మ్యాచ్ లు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇవాల రెండో జరిగిన రెండో టెస్ట్ లో కూడా భారత్ ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో భారీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 245 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మూడు టెస్ట్ ల సిరీస్ ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయింది. కివీస్ స్పిన్నర్ శాంట్నర్  మొత్తం 13 వికెట్లతో సత్తా చాటాడు.

ముఖ్యంగా లంచ్ బ్రేక్ అయిన తరువాత భారత్ పతనం ప్రారంభమైంది. శుభ్ మన్ గిల్(23), యశస్వి జైస్వాల్ (77), రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ(17), సర్పరాజ్ ఖాన్ (9) వాషింగ్టన్ సుందర్ (21) వికెట్లను చేజార్చుకుంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 259, భారత్ 156 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ న్యూజిలాండ్ 255 పరుగులు చేయగా.. భారత్ 245 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ రెండు టెస్ట్ ల్లో ఘన విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version