IPL 2023 : డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన RCB టీమ్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 5వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం గెలుపొందింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ డూప్లేసిస్, కింగ్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో MI బౌలర్ల పై విరుచుకుపడటంతో నాలుగు ఓవర్లకు ముందే RCB గెలిచింది. అయితే గ్రాండ్ విక్టరీ తర్వాత టీం డ్రెస్సింగ్ రూమ్ లో చేసిన సందడి వీడియోను ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఇందులో కోహ్లీతో పాటు ఇతర సభ్యులు డ్యాన్సులు చేస్తూ రచ్చ చేశారు.

ఇది ఇలా ఉండగా, ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ ఊపు కొనసాగించాడు. 6 ఫోర్లు, 5 సిక్స్ లతో ఏకంగా 82 పరుగులు చేసి వావ్ అనిపించారు. ఎనిమిది టికెట్ల తేడాతో ఆర్సిబిని తొలి మ్యాచ్ లో గెలిపించాడు. ఈ క్రమంలోనే తన పేరిట కొత్త రికార్డులను సృష్టించాడు. ఈ పోరులో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ ఐపిఎల్ లో 50వ అర్థ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ మార్కుని అందుకున్న తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు. మొత్తంగా రెండో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ 45 హాఫ్ సెంచరీలతో పాటు ఐదు సెంచరీలు చేశాడు. ఇతడి కంటే ముందు వార్నర్ 60 హాఫ్ సెంచరీలతో టాప్ లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version