BREAKING: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

-

BREAKING: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగింది. ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. అమ్ముతోందని యూత్ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది.

Tension at Uppal Stadium

క్రికెట్ అభిమానులకు టికెట్ల అందకుండా చేస్తున్నారని.. hca సభ్యులు, వారి సన్నిహితులు బ్లాక్ మార్కెట్ దందా నడుపుతున్నారని ఆరోపణలు చేస్తోంది. హెచ్. సి.ఏ వైఖరి నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ముట్టడికి పిలుపునిచ్చారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి. దీంతో ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్మోహన్రావు తక్షణమే ప్రెసిడెంట్ గా తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. చేతకాని వాడిలా జగన్ మోహన్ రావు ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టుకున్నాడని ఆగ్రహిస్తుతన్నారు. క్లబ్ మెంబర్స్ కి ఇచ్చే టికెట్లను కూడా ఆమ్ముకుంటున్నాడని ఆరోపణలు చేశారు శివసేన రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version