నేడు కోల్కతా వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్..

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ కోల్కత్తా వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ బెంగళూరు మధ్య ఫైట్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.

KKR vs RCB, ipl 2025
The first IPL match will be held in Kolkata today

అయితే ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. కోల్కతాలో ఇవాళ 90% వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తొలి మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే చెరో పాయింట్ వెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news