టీ 20 ప్రపంచ కప్ కోసం విరాట్ కోహ్లీ న్యూ లుక్..ఫోటో వైరల్

-

ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన చివరి మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుపు సెంచరీ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో రికీ పాంటింగ్ సెంచరీల సంఖ్యను కోహ్లీ సమం చేశాడు.

తన కెరీర్ లో తొలిసారిగా టి20 లలో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ మ్యాచ్ లో రోహిత్ గైర్హాజరి కావడంతో కోహ్లీ ఓపెనింగ్ గా దిగి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీని ఓపెనర్ గా బరిలోకి దించాలని పలువురు మాజీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

అయితే.. తాజాగా విరాట్‌ కోహ్లీ న్యూ లుక్‌ కనిపించారు. ఫుల్‌ గా కటింగ్‌ చేయించి.. చాలా అందంగా కనిపించారు. వచ్చే నెలలో జరిగే టీ 20 ప్రపంచ కప్‌ కోసం.. విరాట్ ఇలా మారిపోయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విరాట్‌ కోహ్లీ న్యూ లుక్‌ కు సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version