6 వ రోజు కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంఘ్రామ యాత్ర నేటితో 6వ రోజుకు చేరుకున్ంది. నేడు మల్కాజ్ గిరి నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. నేటి బండి సంజయ్ పాదయాత్ర లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జ్ అరవింద్ మీనన్ పాల్గొన్నారు. మల్కాజిగిరి చొరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు బండి సంజయ్.

మల్కాజ్గిరి క్రాస్ రోడ్డు నుంచి ఎల్ కె హాస్పిటల్ రోడ్, జేఎన్ టీ పాయింట్, ఆనంద్ బాగ్ క్రాస్ రోడ్స్, సఫిల్గుడా క్రాస్ రోడ్స్, వినాయక నగర్ క్రాస్ రోడ్డు, నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్, సాయిబాబా మందిరం రోడ్స్, యాప్రాల్ క్రాస్ రోడ్స్ మీదుగా డిఎన్ఆర్ గార్డెన్స్ వరకు నేటి పాదయాత్ర కొనసాగుతుంది. ఇవాళ డిఎన్ఆర్ గార్డెన్స్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. ఈరోజు మొత్తం 10.8 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version