క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన క్రీడాకారులు

-

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసారు ఏపీకి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్‌ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా ఏషియన్‌ ట్రాక్‌ సైక్లింగ్‌ చాంపియన్‌ షేక్‌ అర్షద్, కోచ్‌ ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ఫౌండర్‌ ఆదిత్య మెహతా. బేబి రెడ్డి స్వస్ధలం అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లె, షేక్‌ అర్షద్‌ స్వస్ధలం నంద్యాల. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను అభినందించారు సీఎం వైఎస్‌ జగన్‌.

జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, క్రీడలకు మరింతగా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో (జూనియర్స్‌ టీమ్‌) లో కాంస్య పతకం గెలిచింది బేబి రెడ్డి టీమ్. తాను సాధించిన పతకాలను సీఎం వైఎస్‌ జగన్‌కు చూపింది బేబి రెడ్డి. జాతీయ స్ధాయిలో టీమ్‌ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్ళింది బేబి రెడ్డి.

ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్‌ ట్రాక్‌ సైక్లింగ్‌లో వెండి, కాంస్య పతకాలు సాధించాడు షేక్‌ అర్షద్‌. తాను జాతీయ స్ధాయిలో సాధించిన పతకాలను సీఎంకి చూపాడు అర్షద్. అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో జరగనున్న ట్రాక్‌ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నట్లు సీఎంకి వివరించాడు అర్షద్‌. తమకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎంని కోరారు బేబి రెడ్డి, అర్షద్. దీనికి సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version