పవన్ కళ్యాణ్ పై మళ్లీ నోరుపారేసుకున్న శ్రీరెడ్డి.. దూషిస్తున్నఫ్యాన్స్!

-

నటి శ్రీరెడ్డి మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ పై నోరు పారేసుకుంది. ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ విషయం పై చాలా ఫోకస్ చేశారు. లడ్డూ వివాదాన్ని చులకనగా చూసినా, మాట్లాడినవారిపై తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నారు.పవన్ దెబ్బకు ఇప్పటికే ప్రకాశ్ రాజ్, తమిళ హీరో కార్తీ సైతం వెంటనే దిగొచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మీద నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

గతంలో వైసీపీ పార్టీకి, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఈమె సపోర్టుగా ఉన్నారు. టీడీపీ నేతలను, మాజీ మంత్రులను ఓ ఆటాడుకున్నారు. తన పరుష పదజాలంతో దూషణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా పవన్ మీద కూడా అవే కామెంట్స్ చేశారు. ‘హిందూత్వం పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే యెదవ, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నపుడు ఈ సనాతన ధర్మాన్ని ఏ సంతలో అమ్మేసావురా సన్నాసి?? కమ్యూనిస్టు భావాలు అంటవ్, దీక్షలంటవ్ ఏమన్నా మ్యాచింగ్ ఉందా? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్నవాడికి’.. అంటూ డిప్యూటీ సీఎం పవన్‌పై ఘాటు విమర్శలు చేసింది. దీంతో జనసేన ఫ్యాన్స్, ఫాలోవర్స్ శ్రీరెడ్డిని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version