ఉప్పొంగిన దేశభక్తి.. గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ నెలకొల్పిన విద్యార్థులు..

-

భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. పంజాబ్ చండీగఢ్‌లోని ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో నిల్చొని గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్ నెలకొల్పారు. త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల దుస్తులు ధరించిన విద్యార్థులు జాతీయజెండా మాదిరిగా మైదానంలో నిల్చున్నారు. ఈ ప్రదర్శనలో 5,885 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఇప్పటివరకు యూఏఈ పేరుపై ఉన్న రికార్డును చండీగఢ్‌ విద్యార్థులు అధిగమించారు. మరోవైపు, కర్ణాటక.. కలబురగిలోని ఓ రైతు తన 23 ఎకరాల వ్యవసాయ భూమిలో అంత పెద్దదైన జాతీయ జెండాను ఎగరవేశాడు. ఈ జెండా 75 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు ఉంది. తిరంగా మొత్తం బరువు 140 కేజీలు. తమిళనాడులోని పళనిలో బీజేపీ శ్రేణులు 500 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. బీహార్‌లోని కోటి మంది విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించి వరల్డ్‌ బుక్‌ ఆప్‌ రికార్డ్‌ నెలకొల్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version