అక్టోబర్ 3న చంద్రబాబు పిటిషన్ ను విచారించే బెంచ్ ఖరారు !

-

చంద్రబాబు అరెస్ట్ తర్వాత తమ లాయర్లు ఏ పధకం వేసినా పారడం లేదు. అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ముందుగా హై కోర్ట్ లో ఈ కేసును కొట్టివేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది.. అయినా చంద్రబాబు లాయర్లు వెనుకంజ వేయకుండా, ఓటమిని ఒప్పుకోకుండా సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేశారు. ఒక్కసారి ఈ కేసును విచారించకుండానే అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. కాగా ఈ కేసు మంగళవారం రోజున విచారణకు రానుంది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను విచారించే బెంచ్ ఎవరన్నది కంఫర్మ్ అయింది. ఈ బెంచ్ లో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది లు ఉన్నారు.

మరి మంగళవారం రోజున విచారించనున్న ఈ కేసులో చంద్రబాబు కు ఉపశమనం లభిస్తుందా లేదా హై కోర్ట్ ఇప్పటికే కొట్టేసిన కేసును సుప్రీమ్ కోర్ట్ కూడా కొట్టేస్తుందా చూడాలి. అంతా చంద్రబాబు లాయర్లు వాదించే వాదనను బట్టే ఆధారపడి ఉంటుందన్నది మరికొందరి అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version