ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ సర్కార్​కు​ సుప్రీం షాక్..!

-

సుప్రీం కోర్టులో ఇవాళ.. ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ జరిగింది. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. సీబీఐకి విచారణ అప్పగించడంపై స్టే ఇవ్వాలని పదే పదే తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయినా దీనిపై సుప్రీం కోర్టు స్పందించలేదు.

మరోవైపు ఈ కేసుపై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జులై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో విచారణ జరుపుతామని చెప్పింది. మిస్ లేనియస్ పిటిషన్ కింద విచారణ జరుపుతామని వెల్లడించింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుంది స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version