బ్యాడ్ టైమ్: ఎంపీ అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్ …

-

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వివేకా హత్య కేసులో అతని ప్రమేయం ఉందా లేదా అన్నది ఇంకా క్లారిటీ గా తెలియకపోయినా ఆయనపై సిబిఐ ఎక్కువ దృష్టిని కేంద్రేకరిస్తోంది. ఈయనను విచారించదునైకి చాలాసార్లు ప్రయత్నించినా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పేరుతో తెలంగాణ హై కోర్ట్ లో పిటీషన్ వేసి తప్పించుకుంటున్నాడు, దీనితో అవినాష్ రెడ్డి తరపున లాయర్లు ఇవాళ ఉదయం సుప్రీం కోర్ట్ లో హై కోర్ట్ లో ఉన్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను విచారించాలని అస్సాదేశించాలని కోరుతూ పిటీషన్ వేశారు. కానీ ఇక్కడ సుప్రీం కోర్ట్ కూడా అవినాష్ రెడ్డికి దెబ్బేసింది. అయితే ఈ పిటీషన్ ను వినకుండానే సుప్రీం ధర్మాసనం బ్యాచ్ ల వారీగా వాయిదాల తేదీలను అలాట్ చేసింది.

దీనితో అవినాష్ పిటీషన్ సుప్రీం కోర్ట్ లో ఎప్పుడు విచారణకు వస్తుంది అన్న విషయం కూడా తెలియకపోవడంతో అవినాష్ రెడ్డికి షాక్ తగిలినట్లయింది. దీనితో ఇక సిబిఐ నోటీసు మేరకు 19వ తేదీన అవినాష్ రెడ్డి హైద్రాబాద్ లో విచారణకు హాజరు కాక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version