సుశాంత్ పోస్టుమార్టం రిపోర్ట్.. అందుకే మరణించాడు..!

-

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మ‌హ‌త్య దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం రేపింది. ఇది విని ఎన్నో గుండెలు తరుక్కుపోయాయి. ఇంకా ఈ 2020 లో ఎన్ని ఘోరాలు చూడాలిరా దేవుడా అంటూ కొంత మంది తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతి మాటల సంతాపం తెలిపారు. అయితే ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ఆత్మహత్య కాదు హత్యే అని ఆయన మామ అనడంతో దీనిపై మరింత అనుమానాలు పెరిగాయి. ఈ నేపధ్యం పోస్టుమార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఆయన అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనేది మాత్రం ఎవరికీ అర్ధం కావట్లేదు. పోలీసుకు కూడా దాన్ని ఛేదించే పని ఉన్నారు. కాగా, సుశాంత్ అంత్యక్రియలు, ఆయన స్వస్థలమైన పాట్నాలోనే నిర్వహించనున్నామని కుటుంబీకులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version