నాది అంతా.. కాజేస్తున్నారు, సరిగ్గా పూజలు జరపడం లేదు – స్వర్ణలత

-

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో రంగం కార్యక్రమం కాసేపటి క్రితమే జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్య వాణిని చెప్పింది. నాకు చెప్పండి… మొక్కుబడిగా చేయడం లేదా అని భక్తులను నిలదీసింది రంగంలో స్వర్ణలత. సరిగ్గా పూజలు జరపడం లేదు… ప్రతీ ఏటా చెబుతున్నా పట్టించుకోవడం లేదని వెల్లడించింది.

నాకు సక్రమంగా పూజలు జరిపించండి.. శాస్త్రోక్తంగా నిర్వహించండని కోరింది స్వర్ణలత. నేను మీ హృదయాల్లో దూరి కాపాడుతున్నానని రంగంలో స్వర్ణలత చెప్పింది. ఏటికేటా నా రూపాన్ని మారుస్తున్నారు… నాకు స్థిరమైన రూపం కావాలి, నాది అంతా కాజేస్తున్నారని నిప్పులు చెరిగింది. నేను సంతోషంగా లేకపోయినా… మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చూస్తున్నాను, నా గర్భగుడిలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించండని రంగంలో స్వర్ణలత స్పష్టం చేసింది. ప్రతీ ఏటా నాకు ఆటంకమే కలిగిస్తున్నారు… నా బిడ్డలే కదా అని సరిపెట్టుకుంటున్నానని పేర్కొంది. నా ప్రజలందరూ నను కనులారా వీక్షించుకునేలా పూజలు జరిపించండని కోరింది స్వర్ణలత.

Read more RELATED
Recommended to you

Exit mobile version