ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే సాయన్న సేవలు మరువలేనివి : మంత్రి తలసాని

-

కంటోన్మెంట్‌ సిల్వర్ కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఆవిష్కరించారు. సాయన్న 72వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే సాయన్న సేవలు మరువలేనివని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఎంతో ఘనంగా సాయన్న జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన సమయంలో ఆయన భౌతికంగా మన మధ్యలేకపోవడం చాలా బాధాకరమన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఐదు పర్యాయాలు పని చేసిన సాయన్న నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. భౌతికంగా సాయన్న మన మధ్య లేకపోయినా ఎప్పుడూ మన మనసులో ఉంటారన్నారు. సాయన్న కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సిల్వర్ కాంపౌండ్ వాసులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. కార్యక్రమంలో బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్‌, సాయన్న కుమార్తె నివేదిత, బోయినపల్లి మార్కెట్ చైర్మన్ హారిక, టీఎన్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version