భారత్ చైనా మధ్య మళ్ళీ చర్చలు…!

-

మూడు వారాల విరామం తరువాత, భారత్‌ తో ఎనిమిదవ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుపుతామని చైనా ధృవీకరించింది. దీని కోసం ఇరుపక్షాలు పరస్పరం అనుకూలమైన తేదీలను ఖరారు చేయనున్నాయని చైనా పేర్కొంది. భారత్‌ తో ఎనిమిదో రౌండ్ చర్చలు జరుపుతున్నట్లు చైనా మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వ వర్గాలు కూడా ఖరారు చేసారు.

india-china

సరిహద్దు సమస్యపై భారత్ మరియు చైనా మధ్య చర్చలు అక్టోబర్ 12 న జరిగాయి. తూర్పు లడఖ్ సెక్టార్ డి లో జరిగాయి. రెండు దేశాలు గత ఆరు నెలలకు పైగా ఎల్ఐసి వెంట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆగష్టు 29-30 తేదీలలో, పాంగోంగ్ సరస్సు యొక్క ఉత్తర మరియు దక్షిణ ఒడ్డున భారతదేశం సరిహద్దులను ఆక్క్రమించింది. మొదట దక్షిణ ఒడ్డు నుండి దళాలను మరియు ట్యాంకులను ఉపసంహరించుకోవాలని చైనా భారత్ ని కోరుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version