కేసీఆర్ ముక్త్ తెలంగాణ రావాలి… ఇదే బీజేపీ లక్ష్యం: తరుణ్ చుగ్

-

కేసీఆర్ ముక్త్ తెలంగాణ రావాలని… ఇదే బీజేపీ లక్ష్యం అని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ రోజు రాష్ట్ర పదాధికారుల సమావేశానికి  హాజరైన ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయని… రాష్ట్రంలోని ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని… బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తరుణ్ చుగ్ అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ పోయి బీజేపీ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు చూస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను, రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తులు, కుటుంబం కోసం ఉన్న పార్టీ బీజేపీ కాదని… దేశం కోసమే బీజేపీ ఉందని అన్నారు. బీజేపీ కార్యకర్తల వల్లే బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతం అయిందని… ప్రజా సంగ్రామ యాత్రలో లక్షల మంది ప్రజలు పాల్గొన్నారని తరుణ్ చుగ్ అన్నారు. అమిత్ సభ స్ఫూర్తితో ప్రతీ బీజేపీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version