BREAKING : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం

-

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం అయింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు. వేపాడ విజయాన్ని మొదట ప్రకటించని.. ఎన్నికల సంఘం….ఆ తర్వాత ధృవీకరించింది. ఎమ్.ఎల్.సి.గా వేపాడ చిరంజీవి రావుకు నియామక పత్రం విడుదల చేసింది ఈసీ.

ఇక ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు మాట్లాడుతూ.. నా విజయం వెనుక టీడీపీ, విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషి దాగి ఉందని చెప్పారు. పెద్దల సభలో పట్టభద్రుల సమస్యలపై పోరాడతానని.. జాబ్ క్యాలెండర్ విడుదల అవ్వక యువకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అకాడమీషియన్ గా., పొలిటీషియన్ గా గురుతర బాధ్యతలు నెరవేరుస్తానని వివరించారు. కాగా… ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా వేపాడ చిరంజీవి రావు ప్రమాణ స్వీకారం త్వరలోనే చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version