టిడిపి సభ్యులు సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారు – స్పీకర్ తమ్మినేని

-

రెండవ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టిడిపి సభ్యుల తీరు మారలేదు. ప్రశ్నోత్తరాల సమయం పూర్తికాగానే విరామం అనంతరం సభ ప్రారంభం అయింది. సభ ప్రారంభం కాగానే టిడిపి సభ్యులు బాదుడే బాదుడు అంటూ నినాదాలు మొదలు పెట్టారు. సభలో బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో తమ సీట్లలో కూర్చోవాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిసార్లు చెప్పినా టిడిపి సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభ నుంచి టిడిపి సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు.

అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ప్రతిరోజు టిడిపి సభ్యులు పోడీయాన్ని చుట్టుముట్టి ఆందోళన చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇతర సభ్యుల హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి సభ్యుల తీరును ప్రజలు గమనించాలని, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సభ అంటే ఏంటి? సభ పద్ధతులు ఏంటి? కొన్ని దశాబ్దాలుగా సభలో ఉంటున్న నాకు ఇవన్నీ చూస్తుంటే బాధగా ఉందని అన్నారు స్పీకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version