సీఎం జగన్‌ కు టీడీపీ పార్టీ బహిరంగ లేఖ

-

సీఎం జగనుకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని లేఖ రాశారు. వైసీపీ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయమని జరిగిందని.. టీడీపీ హయాంలో మైనారిటీల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు ఆపేయడం దారుణమని ఫైర్‌ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని. నిలిపేసిన పథకాలను తక్షణమే పునరుద్ధరించి మైనారిటీలను ఆర్థికంగా ఆదుకోవాలని… ముస్లిం సోదరులకు సంక్షేమం అందించడంలో వివక్ష ఎందుకు ? అని నిలదీశారు.

సీఎం జగన్

ప్రభుత్వ చర్యలతో మరింత పేదరికంలోకి మైనారిటీలు వెళ్లారని… వైసీపీ పాలనతో మైనారిటీలకు ఒరిగిందేమిటి ? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఇచ్చిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలకు మంగళం పాడరని.. మూడేళ్లుగా యువతకు ఉపాధి కరువు, నిలిచిన ఉన్నత విద్య, విదేశీ విద్య అని చెప్పారు. బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు చేశారని లేఖలో వివరించారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని. జగన్ రెడ్డి పాలనలో ముస్లింలపై పెరిగిన దాడులు చేస్తున్నారని… ముస్లిం ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఒక్కరిపైనా చర్యలు శూన్యమన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version