విఘ్నేశ్ శివన్-నయనతార హనీమూన్ ఫొటోలు వైరల్..

-

కోలీవుడ్ లవ్ బర్డ్స్ లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్..ఇటీవల మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే.

గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరు…‘పెళ్లి’ బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరు మ్యారేజ్ తర్వాత పుణ్య క్షేత్రమైన తిరుమలను సందర్శించుకున్నారు. ప్రస్తుతం వీరు హనీమూన్ కు వెళ్లారు.

థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్..లో సరదాగా గడుపుతున్నారు. విక్కీ-నయన్ క్లోజ్ గా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అవి వైరలవుతున్నాయి. ‘థాయ్ లాండ్ లో నా థారమ్’ అనే క్యాప్షన్ తో విఘ్నేశ్ శివన్ పలు ఫొటోలను షేర్ చేశాడు.

ఇక ఈ ఫొటోలను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నయనతారతో రౌడీ విఘ్నేశ్ శివన్..అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మరి కొందరు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. కలకాలం మీరు కలిసి మెలిసి ఉండాలని పోస్టులు పెడుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version