ఏపీని నాశనం చేసేందుకు.. జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారు – టీడీపీ ఎమ్మెల్యే

-

ఏపీని నాశనం చేసేందుకు.. జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై ఆర్ధిక ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు…దసపల్లా భూములు.. హయగ్రీవ భూముల దొపిడీని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు.

విజయసాయి, విశాఖ ఎంపీకి మధ్య వాటాల్లో తేడా వచ్చిందని.. అధికార పార్టీ నేతలే వారి అవినీతిని బయట పెట్టుకుంటున్న పరిస్థితి ఉందని తెలిపారు. జగన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే.. ఏపీలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు… ఋషికొండ మీదున్న ప్రభుత్వ రిసార్ట్సును కూల్చేశారని ఆగ్రహించారు.

ఋషికొండ సమీపంలో విజయసాయి, జగన్ రాడిసన్ బ్లూ, బే పార్క్ రిసార్ట్సును కట్టుకున్నారు… అధికార పార్టీ నేతలు కట్టుకున్న ప్రైవేట్ రిసార్ట్స్ కోసం ప్రభుత్వ రిసార్ట్స్ కూల్చేశారన్నారు. ఋషికొండను బోడి కొండ చేశారు…వాళ్ల రిసార్ట్సుకు వ్యాపారం పెంచుకోవడం కోసమే ప్రభుత్వ రిసార్ట్స్ కూల్చారు తప్ప.. రాజధాని కోసం కాదని విమర్శలు చేశారు. సీఎం ఇల్లు కట్టుకోవాలంటే 80 అడుగుల మీదున్న కొండే కావాలా..? సీఎం సతీమణికి అక్కడ వ్యూ నచ్చిందని.. అందుకే అక్కడ క్యాంప్ ఆఫీస్ కడుతున్నారని ఏదేదో చెబుతున్నారని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో పులివెందుల పంచాయతీ కుదరదు… విప్లవ పోరుగడ్డ ఉత్తరాంధ్ర అని స్పస్టం చేశారు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version