విద్యార్థినులకు బ్లూ ఫిల్మ్స్ చూపిస్తూ.. లైంగిక దాడి

-

ఉపాధ్యాయుడి ముసుగు కప్పుకొన్న మరో కీచకుడి దురాగతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆరు నెలలుగా విద్యార్థినులను లైంగికంగా వేధించడం విస్మయానికి గురి చేసింది. ఉపాధ్యాయుడి వికృత చేష్టల గురించి తమ పిల్లల నోట విన్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోవడంతో ఈ దారుణం బయటకు వచ్చింది. విద్యార్థినులు, తల్లిదండ్రుల నుంచి అధికారులు సేకరించిన వివరాలిలా ఉన్నాయి. బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థినులపై ఉపాధ్యాయుడు ఆబు ఆరు నెలలుగా వికృత చేష్టలకు పాల్పడేవాడు. సెల్‌ఫోనులో బ్లూ ఫిల్మ్స్ చూడమని ఒత్తిడి చేసేవాడు. అంతేకాకుండా పిల్లలు మరుగుదొడ్లకు వెళితే అతడూ లోపలికి వెళ్ళి గడియ పెట్టి లైంగిక వేధింపులకు గురి చేసేవాడు.

ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో పిల్లలు చెప్పలేకపోయారు. కొంతకాలంగా పిల్లలు తమకు శరీరంపై నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయని చెప్పినప్పటికీ వేధింపులు, దాడుల గురించి తల్లిదండ్రులకు చెప్పలేదు. దీంతో ఉపాధ్యాయుడి ఆగడాలను చూసి భరించలేక హెచ్‌ఎం పార్వతి.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలని, మిమ్మల్ని ఎవరూ కొట్టకుండా తాను చూసుకుంటానని చిన్నారులకు నచ్చచెప్పారు. దీంతో వారు ఉపాధ్యాయుడి ఆకృత్యాల గురించి తల్లిదండ్రులకు తెలిపారు. ఆవేదన.. ఆగ్రహంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం పాఠశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఆబు పాఠశాలకు గైర్హాజరయ్యాడు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఆబును సస్పెండు చేసినట్లు డీఈవో పురుషోత్తం తెలిపారు. చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిపిన విచారణలో తేలిన వివరాల ఆధారంగా కలెక్టర్‌ ఆమోదంతో ఈ చర్యలు తీసుకున్నామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version