కేరళ విమాన ప్రమాదంలో కన్నీరు పెట్టించే దృశ్యాలు…!

-

కేరళ లోని కోజీకోడ్ విమానాశ్రంలో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఘటనకు సంబంధించి ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంత మంది చిన్నారుల కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి అని, వారు సీట్ల కింద ఇరుక్కుపోయారు అని సహాయక చర్యల్లో పాల్గొన్న వారు చెప్పారు. విమానం రెండు భాగాలుగా విడిపోయింది. దీనితో అక్కడ ఉన్న వారికి అసలు ఎం అర్ధం కాలేదు.

కొందరు వ్యక్తులు అరిచిన అరుపులు తమను బాగా ఆవేదన కలిగించాయి అని అధికారులు కూడా పేర్కొన్నారు. ఆసుపత్రులలో, గాయపడినవారిని తరలించిన దృశ్యం అయితే తమను కన్నీరు పెట్టిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేసారు. సమీపంలో నివసిస్తున్న ప్రజలు కూడా ప్రయాణికుల అరుపులు విని కంగారు పడి పరుగులు తీసారు. ఫ్లైట్ పడిపోయినప్పుడు “భయంకరమైన థడ్” అనే శబ్దం వచ్చిన తర్వాత తాను విమానాశ్రంలోకి వెళ్ళా అని ఒక స్థానిక వ్యక్తి చెప్పారు. చిన్న పిల్లలకు కొందరికి కాళ్ళు తెగిపోయాయి అని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version