ఒట్టేసి చెబుతున్నా.. కెసిఆర్ ను ఇక తిట్టను : తీన్మార్ మల్లన్న

-

తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 7200 మూమెంట్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడి రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడే దాకా పోరాటం చేస్తానని తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గురువారం నిర్వహించిన 7200 మెంట్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అలాగే మంత్రులపై విమర్శలు చేయడం తమ విధానం కాదని పేర్కొన్నారు. ప్రజా చైతన్యానికి తమ పోరాటం అన్నారు తీన్మార్ మల్లన్న. విద్యావంతులైన బాల్క సుమన్ లేదా గాదరి కిషోర్ విద్యాశాఖ అప్పగిస్తే బాగుంటుందని వెల్లడించారు.

పేదోళ్ళ అలాగే పెద్దవాళ్ల బిడ్డలు ఒకే పాఠశాలలో కూర్చొని చదువుకోవాలన్నదే తన లక్ష్యం అని పేర్కొన్నారు. యాదాద్రి లో వందల కోట్లు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలివానకు తేలిపోయిందని మండిపడ్డారు. తమ ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి జూన్ రెండో వారంలో చేపట్టే ప్రజా పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version