నేడు బీజేపీలో చేర‌నున్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌

-

క్యూ న్యూస్ అధినేత‌, ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ తీన్మార్ మ‌ల్ల‌న్న నేడు బీజేపీ పార్టీ లో చేర‌నున్నారు. ఇవాళ ఉద‌యం 11 గంటలకు ఢిల్లీ లోని బీజేపీ కార్యాలయంలో జాతీయ నాయకుల సమక్షంలో ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పార్టీలో చేరనున్నారు. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ అధికారికంగా తీన్మార్ మ‌ల్ల‌న్న బీజేపీ పార్టీ లో చేర‌నున్నారు.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్.. ఆధ్వ‌ర్యంలోనే… బీజేపీ పార్టీ లో చేర‌నున్న‌రు తీన్మార్ మ‌ల్ల‌న్న‌. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్శు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి తదితరులు హాజరవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version