తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్ సంచలన ప్రకటన

-

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలు వస్తాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… కూడా ప్రతి సారి తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతూనే ఉన్నారు. కెసిఆర్ తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెప్పారు.

అయితే ముందస్తు ఎన్నికలపై తాజాగా సీఎం కేసీఆర్ స్పందించారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే … అవసరం అస్సలు లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. కావాలనే కొంతమంది సోషల్ మీడియా లో ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. తమకు 103 సీట్లు ఉన్నాయని… ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతామని ప్రశ్నించారు. ఎవరో చెప్పిన మాటలు అస్సలు నమ్మకూడదు అని… మరో రెండేళ్ల పాటు తమ పాలన కొనసాగుతుందని చెప్పారు సీఎం కేసీఆర్. మరో రెండేళ్ల పాటు మంచిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version