తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దులో ఎన్ కౌంట‌ర్..ఇద్ద‌రు మృతి..!

-

తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతం దంతెవాడ జిల్లా మరోసారి కాల్పులతో దద్ద‌రిల్లింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. గొండెరాస్ అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులోని గొండెరాస్ అటవీ ప్రాంతంలో మావోలు, డీఆర్‌జీ జవాన్లు మధ్య కాల్పులు చోటుచేసుకున్న‌ట్టు స‌మాచారం. సెర్చ్ ఆపరేషన్‌లో ఘటనా స్థలం నుంచి ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతులు హిద్మా కొహ్రామే కాగా ఆమె ఏరియా క‌మిటీ స‌భ్యురాలుగా ప‌నిచేస్తున్నారు. అంతే కాకుండా కొహ్రామే పై రూ.5ల‌క్ష‌ల రివార్డు ఉంది. మ‌రో మ‌హిళ పొజ్జె గా గుర్తించారు. ఆమె సీఎన్ ఎం ఇన్ ఛార్జ్ గా ప‌నిచేస్తున్నారు. ఆమెపై ల‌క్ష రూపాయ‌ల రివార్డు ఉన్న‌ట్టు స‌మాచారం. సంఘటనా స్థలం నుండి రైఫిళ్లు, మందుగుండు సామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు, క్యాంపింగ్ మెటీరియల్స్ మొదలైనవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం కూంబింగ్ సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version