తెలంగాణా కరోనా.. 2,426 కేసులు, 13 మరణాలు

-

గత కొద్ది రోజులుగా మూడు వేలకి దగ్గరదగ్గరగా తెలంగాణా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజూ అరవై వేలకి పైగా టెస్ట్ లు చేస్తుండడంతో కేసుల సంఖ్య కూడా అదే రేంజ్ లో నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 2,426 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,52,602కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 13 మంది కరోనా వలన చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 940కు చేరింది.

coronavirus
coronavirus

ఇప్పటిదాకా కరోనా నుండి 1,19,467 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 2,324 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 32,195 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 25,240 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 62,890 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 20,16,461కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 338 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 216 కేసులతో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version