పోలీస్‌ ఈవెంట్స్‌ లో అస్వస్థతకు గురై అభ్యర్థి మృతి

-

పోలీస్‌ ఈవెంట్స్‌ లో అస్వస్థతకు గురై అభ్యర్థి మృతి చెందాడు. హనుమకొండ కేయూ మైదానంలో పోలీసు ఉద్యోగాల నియమాకాల ములుగు జిల్లా పందికుంట శివారు శివతండా గ్రామానికి చెందిన బనోత్ రాజేందర్ (27) ఈ నెల 17న సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. ఆ క్రమంలో కార్డియాక్ అరెస్టుతో కిందపడి పోయాడు రాజేందర్.

దీంతో అక్కడున్న వైద్యులు కార్డియో పల్మొనరీ రిససిటేషన్(సీపీ ఆర్) చేసి, రాజేందర్ ను స్పృహలోకి తెచ్చారు. ఆ వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తీసుకు రాగా, క్యాజువాలిటీలో మరోసారి కార్డియాక్ అరెస్టెంది. తిరిగి వైద్యులు సీపీఆర్ చేసి రక్షించారు. రెండుసార్లు కార్డియాక్ అరెస్టు కావడంతో వైద్యులు బాధితుడిని ఆర్ఎస్ఐసీయూ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే, నిన్న అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో రాజేందర్ మృతి చెందాడు. దీంతో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా స్వస్థలానికి మృతదేహాన్ని తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version