వైట్ సిటీ తరహాలో తెలంగాణ సచివాలయం.. ఫోటోలు వైరల్

-

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలను చాలా చక్కగా కొనసాగిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దింది కేసీఆర్ ప్రభుత్వం. అటు యాదాద్రి టెంపుల్ ను కూడా చాలా చక్కగా అభివృద్ధి చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే పాత సచివాలయాన్ని కూల్చేసి, కొత్త సచివాలయాన్ని కడుతున్నారు.

ప్రపంచంలో ఏ భవనం లేని విధంగా అనేక హంగులతో ఈ సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. అచ్చం వైట్ హౌస్ లా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. అయితే ఈ సచివాలయం కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన ఆ నెటిజన్లు ఫీదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version