హైదరాబాద్‌ లో మరో ఘటన..పిచ్చికుక్క దాడిలో 9 మందికి గాయలు

-

హైదరాబాద్‌ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పిచ్చికుక్క దాడిలో 9 మందికి గాయలు అయ్యాయి. బాలుడిపై కుక్కలు చేసిన దాడి మరువక ముందే, యాచారంలో మరో పిచ్చి కుక్క దాడికి తెగపడింది. ఈ నేపథ్యంలోనే తొమ్మిది మందిపై దాడి చేసింది ఆ కుక్క. దీంతో పలువురికి తీవ్ర గాయాలు కాగా, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

కాగా, హైదరాబాద్​లో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందడంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్​తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల బెడద నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version