కాంగ్రెస్‌ నేతలకు అక్బరుద్దీన్‌ హెచ్చరిక

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలోనే వేలంపాటకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. ఇక నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. నేను ప్రసంగిస్తే దేశమంతా వణికిపోయిందన్నారు. సాయంత్రం నుంచి మిమ్మల్ని వేలం పాట పాడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు వేలం పాటకు సిద్దంగా ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఎంఐఎం అధ్యక్సుడు అసదుద్దీన్ ఒవైసీ పై టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ తన షెర్వానీ లోపల పైజామా ఉందనుకున్నానని.. లోపల ఖాకీ నెక్కరు ఉందని అర్థం అయిందని ఘాటు వ్యాఖ్యలు సంచలనం చేశారు. రాజాసింగ్ పై మస్లీస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, మోడీ లాంటి దొంగలను కాపాడటానికి ఓవైసీ అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version