సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసంపై పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌

-

AP Deputy CM Pawan Kalyan Condemns Secunderabad Muthyalamma Idol Vandalise: సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసంపై ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయ్యారు. సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇది దుర్మార్గం.. మహాపచారం అంటూ రెచ్చిపోయారు ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశానని వివరించారు ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.

AP Deputy CM Pawan Kalyan Condemns Secunderabad Muthyalamma Idol Vandalise

ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమన్నారు. అందుకే తిరుపతిలో జరిగిన సభలో వారాహి డిక్లరేషన్ లో చెప్పానని వెల్లడించారు ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version