తెలంగాణ కేబినేట్ సమావేశం..కీలక మెట్రో ప్రాజెక్టులకు నేడు ఆమోదం..?

-

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో కారిడార్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నేడు జరగనున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే మరో ఐదు కొత్త మెట్రో ప్రాజెక్టులను నిర్మించే అంశాన్ని సైతం పరిశీలిస్తోంది. BHEL నుంచి లక్డికపూల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు కొత్త లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఇవాళ తెలంగాణ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. ఇవాళ అంటే సోమవారం నాడు మధ్యాహ్నాం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర కేబినేట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా.. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద తెలంగాణ రాష్ట్ర కేబినేట్ చర్చించనున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version