‘బేబి’ ఫీలింగ్‌ మూడు రోజులు వెంటాడింది: చిరంజీవి

-

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా బేబీ సినిమా గురించే చర్చ. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాదే రచ్చ. తాజాగా ఈ చిత్ర విజయోత్సవాన్ని పుస్కరించుకుని హైదరాబాద్ లో బేబీ చిత్ర మెగా కల్ట్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

“‘బేబి’లోని సమకాలీన కథ, అందులోని దర్శక విలువలు.. దాని ద్వారా రాజేష్‌ ఇచ్చిన సందేశం మామూలుది కాదు. ఆనంద్‌ ఈ సినిమాలో సహజంగా నటించాడు. తన ప్రియురాలి గురించి నిజం తెలిసిన సందర్భంలో ఆనంద్‌ కనబరిచిన భావోద్వేగాలు చూసి అతనిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా? అని ఆశ్చర్యపోయా. వైష్ణవి మానసిక సంఘర్షణ ఈ చిత్రాన్ని నిలబెట్టింది. ఈ సినిమా ఫీలింగ్‌ నుంచి రెండు మూడు రోజులు బయటకు రాలేకపోయా’’ అని చిరంజీవి అన్నారు.

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్‌ తెరకెక్కించారు. ఎస్‌కేఎన్‌ నిర్మాతగా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version