ఓవైసీ కాలేజీలో ఉగ్రవాదులు ఉన్నారు – బండి సంజయ్‌ సంచలనం !

-

ఓవైసీ కాలేజీలో ఉగ్రవాదులు ఉన్నారని..ముఖ్యంగా ఓ ఉగ్రవాది టీచర్‌ కూడా ఉన్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ… బీజేపీకి ఇస్లాం ఫోబియో ఉందని ఓవైసీ అంటున్నారు… 15 నిమిషాలు టైం ఇస్తే నరికి చంపుతాం అన్నవారికి హిందూ ఫోబియో ఉందా..? అంటూ ప్రశ్నించారు. గో మాంసం తినాలని మజా అని అన్నది ఓవైసీ అని ఆగ్రహించారు.

bandi sanjay comments on owaisi college

ఓవైసీ కాలేజీలో ఒక ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడని… మదర్సాల్లో ఉగ్రవాదులు ఉన్నారని బాంబ్‌ పేల్చారు. సెక్యులర్ జపం చేస్తున్న ఓవైసీ… హిందూ పండగలు ఎందుకు జరుపరన్నారు. మేము, మా హిందువులు… సెక్యులర్స్ పీర్ల పండగ జరుపుతామని తెలిపారు. ఓవైసీలకు, ఎంఐఎం కి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేశారు. వారి ఉగ్ర లింకుల పై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అమృత్ స్కీం లో అవినీతి జరిగిందని కేటీఆర్ అంటున్నాడు బీజేపీ పై ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహించారు. అమృత్ స్కీం అవినీతి పై ఆధారాలు ఇవ్వండి…విచారణ జరిపి కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version