సీఎం కేసీఆర్ తడి బట్టలతో భాగ్యలక్ష్మి గుడిలో జొర్రాలి – బండి సంజయ్

-

తడి బట్టలతో మళ్లీ ఫాంలోకి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వచ్చారు. మోడీ చేసిన ఆరోపణలు తప్పని నిరూపించాలి అంటే కేసీఆర్ తడి బట్టలతో భాగ్యలక్ష్మి గుడిలో జొర్రాలంటూ సవాల్‌ విసిరారు బండి సంజయ్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ చౌరస్తా లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

పాలమూరు ఇందూర్ లో బహిరంగ సభ విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. రెండు ప్రారంభోత్సవం సందర్బంగా 20 వేల కోట్లు అభివృద్ధి పనులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలు దేశ ప్రధానిని మర్చిపోరని… కల్వకుంట్ల కుటుంబం అరుపులు చూసి పిచ్చి కుక్కలు సైతం అరుస్తున్నాయని మండిపడ్డారు. ఏ పిచ్చికుక్క పిలిస్తే ఎన్ డి యే కూటమి ర్యాలీలో కెసిఆర్ పాల్గొన్నారు…మీది ఏ కూటమి NDA, UPA.. ఎవ్వరు నమ్మరంటూ ఆగ్రహించారు. మోసగాడీ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని.. దుబాయ్ చంద్రశేఖర్ నుంచి నేటి అజయ్ రావు వరకు అంత మోసమేంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version