కరీంనగర్ లో శ్రీవారి దేవాలయం నిర్మించడం చాలా సంతోషం – బండి సంజయ్‌

-

కరీంనగర్ లో శ్రీవారి దేవాలయం నిర్మించడం చాలా సంతోషం అన్నారు బండి సంజయ్‌.కరీంనగర్ లోని పద్మానగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి సంబంధించి ఈరోజు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఏడుకొండల వెంకటేశ్వరస్వామి భక్తుల కొంగు బంగారం. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడు వెంకటేశ్వరస్వామి.

విదేశీ భక్తులెందరో వస్తున్నారు. అట్లాంటి స్వామిని ప్రజల వద్దకు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో టీటీడీ కరీంనగర్ లో ఆలయం నిర్మించడం చాలా సంతోషం. ఇందులో పాల్గొనడం పూర్వ జన్మ సుక్రుతం అన్నారు బండి సంజయ్‌. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో, ధార్మిక కార్యక్రమాల అమలు కోసం టీటీడీ ఎంతగానో క్రుషి చేస్తోంది. అందులో భాగంగా రూ.20 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడం సంతోషం. ఇది జిల్లా ప్రజల అద్రుష్టం. ఈ ప్రాంత ప్రజల కోరికలు తీర్చే, కష్టాలను తొలగించే శక్తివంతమైన దేవాలయంగా ప్రసిద్దిగాంచాలని వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నా. కరీంనగర్ ఎంపీ టీటీడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version