కేసీఆర్ కు మందు మీద ప్రేమ.. మంది మీద కాదు – బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ కు మందు మీద ప్రేమ.. మంది మీద కాదని ఏద్దేవా చేశారు బండి సంజయ్. జనగామ జిల్లా ధర్మారం లోో బండి సంజయ్ మాట్లాడుతూ…ప్రధాన్ ఆవాస్ యోజన కింద రెండు లక్షల ఇండ్లు ఇస్తే కేసీఆర్ ఎందుకు ఇవ్వాట్లే? పాతభస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారు సాక్షిగా పాదయాత్ర ప్రారంబిస్తే టిఆర్ఎస్ కు భయం పుట్టిందని చురకలు అంటించారు. స్థానిక ప్రజాప్రతినిధులను అంగాట్లో సరుకులలాగా కొనుగోలు చేస్తున్నారు,బెదిరిస్తున్నారు… విస్నూర్ రామచంద్రారెడ్డికీ ఈ కేసీఆర్ కు ఏమీ తేడా లేదన్నారు.

తండాలకు,గ్రామాలకు ఎమీ ఇచ్చారు..లైట్ లేదు,మోరి లేదు…300 వందల ఎకరాలలో నీకు ఫ్రీ కరెంటా కేసీఆర్? అని ఫైర్ అయ్యారు. పండించిన ప్రతి ధాన్యం కొనుగోలు చేసేది బీజేపీ ప్రభుత్వం అని..గ్రామల అభివృద్ధికి ప్రతి పైసా కేంద్రప్రభుత్వందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ రైతులను,యువకులను,ఉద్యోగులను సిఎం కేసీఆర్ మోసం చేస్తున్నారు.. సీఎం కేసీఆర్ లక్షలలో అప్పులు చేశాడనన్నా రు. పేదల ఓటును డబ్బులతో కొనడమే సీఎం కేసీఆర్ పని…అని ఎన్ని డబ్బులు హుజూరాబాద్ లో,దుబ్బాకలో పంచిన మోడీ పాలన చూసి బీజేపీని గెలిపించారు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version