తెలంగాణ ఉద్యోగస్తులకు శుభవార్త….డిఏపై కీలక ప్రకటన

-

తెలంగాణ ఉద్యోగస్తులకు శుభవార్త….డిఏపై కీలక ప్రకటన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ….కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూలై వరకు కూడా ప్రతి నెల పింఛన్ల డబ్బులను విడుదల చేశామన్నారు. ఉద్యోగస్తులకు మూడు డిఏ లను పెండింగ్ లో పెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వమే. ఒక్క డిఏ మాత్రమే మా ప్రభుత్వంలో పెండింగ్లో ఉందని వెల్లడించారు. ఉద్యోగస్తులకు త్వరలోనే శుభవార్త చెబుతామన్నారు.


బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా సంవత్సరాల తరబడి డి ఏ లను పెండింగ్లో పెట్టబోమని.. వెంటనే చెల్లిస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లోనే బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా విద్యుత్ సరఫరా చేసింది. లెక్కలతో సహా సభకు ఇస్తాం. జగదీశ్ రెడ్డి చేసిన ఆరోపణలు సరైనవి కావు అన్నారు. 24 గంటలు రెప్పపాటు కరెంటు పోకుండా ఉండాలని ప్రజల కోసం మా ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకనే బిఆర్ఎస్ పాలనలో కంటే పాలనలో ప్రజల నుంచి ఫిర్యాదులు తగ్గాయనితెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో 2023 ఫిబ్రవరి మాసంలో ట్విట్టర్ ద్వారా 4352 ఫిర్యాదులు వస్తే.., 2024 ఫిబ్రవరిలో 1786 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version