కార్పొరేట్ శక్తుల కోసమే బిజెపి ఆరాటం – మంత్రి వేముల

-

వరంగల్ సభలో సీఎం కేసీఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నేడు హైదరాబాద్ లో ఆయన మీడియోతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నినాదం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అయితే.. మోదీ నినాదం అబ్ కీ బార్ బిజెపి సర్కార్ అని అన్నారు. తమ పార్టీ ప్రయోజనం కోసమే మోడీ మాట్లాడారని మండిపడ్డారు. దేశ రైతాంగం కోసం కేసీఆర్ కృషి చేస్తుంటే.. కార్పొరేట్ శక్తుల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది ట్రైలర్ అని బెదిరించే వారు ప్రధాని అవుతారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ధ్వజమెత్తరు. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ సర్కార్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version