కాంగ్రెస్ లో చేరనున్న బీజేపీ నేత ఈటల రాజేందర్ ?

-

తెలంగాణ బిజెపి పార్టీకి ఊహించని షాక్ తగిలే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే మాజీమంత్రి హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మారే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

త్వరలోనే ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఆయనకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైందట. ఈసారి ఎలాగైనా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందట. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ కు గాలం వేస్తోందని తెలుస్తోంది. కాగా హుజరాబాద్ మరియు గజ్వేల్ నియోజకవర్గాలలో పోటీ చేసిన ఈటల రాజేందర్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version