మధ్యాహ్నం తాగే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు అంటూ ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడే పిస్స ఎంకడు… మధ్యాహ్నం తాగే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు అంటూ ఆగ్రహించారు. నన్ను కాదని ఓడిపోయిన మనిషిని తీసుకొచ్చి ఎమ్మెల్యే పరిచయం చేయడానికి ఎవరు నువ్వు అంటూ నిప్పులు చెరిగారు.

నీకు డబ్బు ఎక్కువ ఉంటే మడిచి దగ్గర పెట్టుకో ? కోమటిరెడ్డి అనే పేరు వల్ల బతికిపోయావ్ ? అని మండిపడ్డారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నువ్వు నల్లగొండలో రాజీనామా చెయ్యి నేను నిజామాబాద్ జిల్లాలో రాజీనామా చేస్తా పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో ? అని సవాల్ విసిరారు. నీకు బాగా బలుపు ఉంది మడిచి పెట్టుకో ? అని ఆగ్రహించారు. దక్షిణ తెలంగాణ నుండి ఉత్తర తెలంగాణలో పిచ్చి వాగుడు వాగుతున్నాడు అన్నారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి