బిఆర్ఎస్ నేతలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు – భట్టి

-

సీఎం కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరని.. బిఆర్ఎస్ నేతలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. బిఆర్ఎస్ ని బంగాళాఖాతంలో పడేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. నేడు నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. విచారణ సంస్థల నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టారని అన్నారు.

9 ఏళ్లుగా కృష్ణా జలాలలో తెలంగాణ వాటా తేల్చలేదని.. ఎందుకు లాలూచీపడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో ఐదు లక్షల కోట్లు అప్పు తెచ్చారని, కానీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల హక్కులను హరిస్తున్నప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళకూడదు కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version