కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ

-

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. దిల్లీలో తమకు కేటాయించిన ఛాంబర్​లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి, అనంతరం, పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్‌రెడ్డి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి రెండో సారి ఎంపీగా గెలుపొందారు. మోదీ కేబినేట్‌లో మరోసారి అవకాశం దక్కించుకున్న ఆయనకు…. బొగ్గు, గనులశాఖ బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సైతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఎంపీగా విజయం సాధించిన సంజయ్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ సర్కార్‌లో అవకాశం దక్కింది. ఈ మేరకు ఆయన తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈ ఇరువురు నేతలకు రాష్ట్ర బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version