హైడ్రా భయంతో మహిళా ఆత్మహత్య…స్పందించిన రంగనాథ్ !

-

హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న తరుణంలో..హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

hydra ranganadh reacts on kukatpally issue

అయితే… కూకట్పల్లి కి సంబంధించిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో… హైడ్రా పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా హైదరాబాదులో హైడ్రాను ఆపేయాలని… లేకపోతే మరణాలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నాయని కొంతమంది భావిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఈ ఆత్మహత్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించడం జరిగింది. బాధిత మహిళ ఆత్మహత్యకు… హైడ్రా కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించారు. అదంతా తప్పుడు ప్రచారమని మండిపడ్డారు రంగనాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version