CM KCR : నేడు నిర్మల్‌కు కేసీఆర్… కారణం ఇదే

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లాల పర్యటనపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లా పర్యటన ఖరారు అయింది. సీఎం కేసీఆర్ ఇవ్వాళ నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎల్లంపల్లి గ్రామ శివారులో 56 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర రావు ప్రారంభిస్తారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు నిర్మల్ జిల్లాలోని అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version