BREAKING : కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త..

-

BREAKING : కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త.. చెప్పారు. కానిస్టేబుల్ పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గింపునకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్వయంగా కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ , ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని ప్రకటించారు. దీనిపై కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా… ఏపీ నుంచి రూ.17828 కోట్లు తెలంగాణకే రావాలని… సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పించడం లేదని ఫైర్ అయ్యారు. ఏపీకి రూ. 6000 కోట్లు నెల రోజులు కట్టాలని అంటున్నారు.. ఇవ్వాల్సిన రూ. 3000 కోట్లకు 18% వడ్డీతో ఆరు వేల కోట్లు కట్టాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం అన్నీ అమ్మేస్తోంది, వ్యవసాయం, విద్యుత్‌ మాత్రమే మిగిలాయి.. సంస్కరణల పేరుతో వీటిని అమ్మేందుకు చూస్తున్నారు.. దుబ్బాకలో పండే పంటను సిద్ధిపేటలోనే అమ్మే పరిస్థితి ఉండదు, కేంద్రం ఎక్కడైనా అమ్ముకోవచ్చని మాయ మాటలు చెబుతోందన్నారు కేసీఆర్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version