నేడు 3 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి సభలు

-

రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పెండింగ్లో ఉన్న ఖమ్మం , కరీంనగర్ , హైదరాబాద్ మినహా మిగిలిన 14 లోకసభ స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ప్రతి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆత్రం సుగుణ , జీవన్ రెడ్డి , సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ల కార్యక్రమాలకు రేవంత్ హాజరు కానున్నారు. భారీ ర్యాలీతో తరలి వెళ్లి ఈ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. రేపు నాగర్కర్నూల్ పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నేడు 3 లోక్‌సభ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి బహిరంగ సభల షెడ్యూల్ ఇదే

ఇవాళ ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ సభ

ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ సభ

సాయంత్రం 4.15 గం.కు మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ సభ

Read more RELATED
Recommended to you

Exit mobile version